ఇంఫాల్ : మణిపూర్ను భూకంపం వణికించింది. ఆదివారం ఉదయం 6.56 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో ఉక్రుల్లో భూమి కంపించిందని పేర్కొంది. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. అయితే, భూకంపంతో ఒక్కసారిగా జనమంతా బయటకు పరుగులు పెట్టారు. ఉక్రుల్కు 49 కిలోమీటర్ల దూరంలో, భూమికి 109 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. శనివారం అరుణాచల్ప్రదేశ్లోనూ భూమికి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని చెప్పింది.