Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మీరు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కాషాయ పాలకులు మీ ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తీసేస్తారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
బెంగాల్లో సీఏఏను తాను అమలు చేయబోనని, ఎన్ఆర్సీని ఇక్కడ అమలు చేసేందుకు అనుమతించనని దీదీ స్పష్టం చేశారు. అస్సాంలో సీఏఏను అమలు చేస్తుండగా అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాషాయ నేతలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) గురించి మాట్లాడుతున్నారని, యూసీసీని వారు తీసుకువస్తే ఏమవతుందో మీ కు తెలుసా అని ప్రశ్నించిన దీదీ మీరు మీ గుర్తింపును కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :