ముంబై : ముంబై 26/11 ఉగ్రదాడిపై కాంగ్రెస్కు చెందిన మహారాష్ట్ర ప్రతిపక్ష నేత విజయ్ నామ్దేవ్ వడెట్టివర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజం స్కాడ్(ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరేని చంపింది ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాదని వ్యాఖ్యానించారు. కర్కరేను చంపింది ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న ఒక పోలీసు అని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రదాడి కేసులో ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికమ్ను లక్ష్యంగా చేసుకొని విజయ్ వడెట్టివర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉజ్వల్ ప్రస్తుతం బీజేపీ తరపున ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ‘ఉజ్వల్ కోర్టులో కూడా నిజం చెప్పని ఒక ద్రోహి’ అని విజయ్ ఆరోపించారు.