జడ్చర్లటౌన్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం కమాన్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్బహుదూర్శాస్త్రీ చిత్రపటాలకు నివాళులర్పించారు.
బాదేపల్లి పాతబజార్ గాంధీ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. పట్టణంలోని గాంధీ ట్రస్టు ఆవరణలో జాతిపిత గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతుండటంతోనే దేశ స్థాయిలో అత్యధిక అవార్డులు అందుతున్నాయన్నారు. పట్టణంలోని గాంధీట్రస్టు స్థలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయం, దవాఖాన, గాంధీభవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, గాంధీట్రస్టు కన్వీనర్ సీతారాంజవార్, కౌన్సిలర్లు, ముడా డైరక్టర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.