హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను బాలానగర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (60), రవి (30)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.