న్యూఢిల్లీ, మే 16: లోక్సభ ఎన్నికల్లో మొదటి నాలుగు దశల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. మొత్తం 97 కోట్ల ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటు వేశారని తెలిపింది. నాలుగో దశలో 69.16 శాతం పోలింగ్ (2019 ఎన్నికల కంటే 3.65 శాతం ఎక్కువ) నమోదైందని ఈసీ తెలిపింది. మొదటి దశలో 66.14 శాతం (గత ఎన్నికల్లో 69.64 శాతం), రెండో దశలో 66.71 శాతం (గతంలో 69.64), మూడో దశలో 65.68 శాతం (గతంలో 69.64) పోలింగ్ నమోదైంది. వివిధ సంస్థలతో పోలింగ్ శాతం పెంపునకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.