బెంగుళూరు: సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1(Aditya-L1) స్పేస్క్రాఫ్ట్ను ఇస్రో నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఆ వ్యోమనౌకలో ఉన్న రెండు రిమోట్ సెన్సింగ్ పరికరాలు.. సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీకరించాయి. ఈ విషయాన్ని ఇస్రో ఇవాళ వెల్లడించింది. తన ఎక్స్ అకౌంట్లో ఇస్రో ఆ సూర్యుడికి చెందిన ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ ఏడాది జనవరి ఆరో తేదీన ఆదిత్య ఎల్1 .. లాగ్రాంగియన్ పాయింట్కు చేరుకున్న విషయం తెలిసిందే. భూమికి సుమారు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఆదిత్య ఎల్1 ఉన్నది. అక్కడి నుంచే సూర్యుడిని ఆ స్పేస్క్రాఫ్ట్ అధ్యయనం చేస్తోంది.
సోలార్ ఆల్ట్రా వాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్యూఐటీ), విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పరికరాలు.. సూర్యుడిలో జరుగుతున్న పరిణామాలను పసికట్టాయి. మే నెలలో ఆ చిత్రాలను తీసినట్లు ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. కరోనల్ మాస్ ఎజెక్సన్స్తో లింకున్న ఎక్స్-క్లాస్, ఎం-క్లాస్ జ్వాలలను రికార్డు చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
సూర్యుడిలోని ఏఆర్13664 ప్రాంతం యాక్టివ్గా ఉందని, అక్కడ మే 8 నుంచి 15వ తారీఖు మధ్య ఎక్స్-క్లాస్, ఎం-క్లాస్ జ్వాలలు ఉత్పన్నం అయినట్లు గుర్తించారు. వీటి వల్లే మే 11వ తేదీన జియోమాగ్నటిక్ స్ట్రార్మ్ వెలుబడినట్లు ఆ ప్రకటనలో చెప్పారు. మే 17వ తేదీన ఎస్యూఐటీ తీసిన సూర్యుడి చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. అంతేకాకుండా వీఈఎల్సీ సూచించిన వివరాలను కూడా ఇస్రో చెప్పింది.
Aditya-L1 Mission:
SUIT and VELC instruments have captured the dynamic activities of the Sun 🌞 during May 2024.Several X-class and M-class flares, associated with coronal mass ejections, leading to significant geomagnetic storms were recorded.
📷✨ and details:… pic.twitter.com/Tt6AcKvTtB
— ISRO (@isro) June 10, 2024