భువనేశ్వర్: హోంగార్డ్ సెలక్షన్స్కు 8,000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో అంత మందికి పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా రన్వేపై వారికి రాత పరీక్ష నిర్వహించారు. (Odisha exam held on airstrip) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుమారు 200లోపు ఉన్న హోంగార్డుల పోస్టుల భర్తీకి అభ్యర్థులు అసాధారణ సంఖ్యలో దరఖాస్తు చేశారు. నియామక పరీక్ష కోసం 8,000 మందికిపైగా హాజరయ్యారు.
కాగా, ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం పోలీస్ అధికారులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న ఉదయం వేళ ఏకంగా జమదర్పాలిలోని రన్వేపై అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. దీంతో ఆ రన్వే పొడవునా వేలాది మంది అభ్యర్థులు వరుసగా కూర్చొని పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, భద్రత కోసం భారీగా పోలీస్ అధికారులు, సిబ్బందిని మోహరించారు. అలాగే అభ్యర్థుల పరీక్షను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు 187 హోంగార్డుల పోస్టుల భర్తీకి కనీస అర్హత 5వ తరగతి ఉత్తీర్ణత. అయితే ఉన్నత విద్యావంతులు వేల సంఖ్యలో దరఖాస్తు చేశారు. సంబల్పూర్ జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంబీఏ చదివినవారు, డిప్లొమా హోల్డర్లు, ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులు హోంగార్డు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. దీంతో ఒడిశాలో నిరుద్యోగ సమస్యకు ఇది అద్దంపట్టింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
This is not a movie scene. This is BJP-ruled Odisha.
Where more than 8,000 aspirants, including MBA & MCA graduates, were lining up for just 187 Home Guard vacancies. This is the brutal reality of @BJP4India’s so-called “double engine” governance.
Degrees in hand. Jobs nowhere.… pic.twitter.com/xQYMwylxSe
— All India Trinamool Congress (@AITCofficial) December 19, 2025
Also Read:
Railways Hikes Fares | ఛార్జీలు పెంచిన రైల్వే.. డిసెంబర్ 26 నుంచి అమలు
Migrant Worker Lynched | బంగ్లా దేశీయుడిగా అనుమానించి.. వలస కార్మికుడిని కొట్టి చంపారు