ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimhaswamy) , వేంకటేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామివార్ల రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథాల ముందు పూర్ణాహుతి పూజల అనంతరం స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచారు. అంతకు ముందు ఆలయంలో యజ్ఞాచార్యులు పురుషోత్తమాచారి, వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ మంత్రోచ్చరణల మధ్య హోమాది పూజలు ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఆలయం నుంచి పట్టణంలోని నంది చౌక్ వరకు రథాలపై ఊరేగించారు. చక్రతీర్థం పూజలు, యోగ లక్ష్మీనరసింహస్వామివారి పుష్పయాగం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు రవీందర్, ముత్తినేని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.