ధర్మారం, ఏప్రిల్ 26: ఖిలావనపర్తికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మమత పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై అభిమానం చాటుకున్నారు. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మెట్లు మోకాళ్లపై ఎక్కి పూజలు చేశారు. ఈశ్వర్ విజయానికి ఆ నృసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.