హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది, నల్లగొండను దేశానికే ధాన్యపు కొండగా మార్చింది కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రభుత్వ పట్టుదల అని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో తీసుకువచ్చిన ‘రైతుల జోలికొస్తే ఊరుకోం’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సాగు, తాగునీరు అందిస్తూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి మహత్తర పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ తెలంగాణను తీర్చిదిద్దారని పేరొన్నారు.
బిందెలు పట్టుకొని మంచినీళ్ల కోసం కోసులకొద్దీ నడుస్తూ అవస్థలు పడుతున్న ఆడపడుచుల బాధలను తీర్చడం కోసమే ఇంటింటికి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజల అజెండానే దేశం జెండాగా చేసుకొని ప్రజా సమస్యల పరిషారానికి కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో అడుగులు వేస్తున్నారని వివరించారు. కులమతాల పేరుతో, భాషా ఆధిపత్యాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తెలంగాణ భగ్నంచేసి తీరుతుందని అన్నారు. ఒక కులంపై మరోకులం, ఒక వర్గంపై మరోవర్గం, ఒక మతంపై మరోమతం, ఒక భాషపై మరోభాషను రుద్ది ఆధిపత్యాలను చెలాయించే విభజన వికృత సంస్కృతికి చరమగీతం పాడకపోతే దేశం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. గ్రామీణ తెలంగాణ, పట్టణ తెలంగాణలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రగతి దేశానికే నమూనాగా నిలిచిందని, ఇది తెలంగాణ సమాజానికి గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ఈ పుస్తకావిషరణ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి హారీశ్రావు, తెలంగాణ సాహిత్య అకాడమి చైైర్మన్ జూలూరు గౌరీశంకర్, కౌన్సిల్ చీఫ్విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి
మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ట్రెసా విజ్ఞప్తి
వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావును ట్రెసా కోరింది. ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు శుక్రవారం కేటీఆర్, హరీశ్రావుతో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న వివిధ క్యాడర్ల పదోన్నతులు, ఇతర రెవెన్యూ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అమలు వంటి అంశాలను మంత్రుల దృష్టికి తెచ్చారు. దాంతో సానుకూలంగా స్పందిస్తూ.. అన్ని విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిషరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వివరించారు. మంత్రులను కలిసినవారిలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, రాజ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, పూల్ సింగ్, ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, మాధవి రెడ్డి, కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, వివిధ జిల్లాల అధ్యక్షులు రామకృష్ణ, రమణ్ రెడ్డి, సుధాకర్, రామకృష్ణా రెడ్డి, వీఆర్ఏ జేఏసీ చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జనరల్ దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్ వెంకటేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.