హైదరాబాద్ : నగరంలోని అంబేద్కనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. నగర వాసుల కోసం ప్రభుత్వం రూ.28కోట్లతో 330 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇండ్లను నిర్మించింది. ఈ మేరకు మంత్రి ఇండ్లను ప్రాంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అంతకు ముందు డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పులు, బోనాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.