సిమ్లా : ప్రపంచంలో అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా హిమాచల్ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో కనిపించింది. ఇలాంటి వాటికోసం నిత్యం వెతికే వన్యప్రాణి విభాగం అధికారులు.. ఇప్పుడు కనిపించడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాముల్లో రారాజుగా చెప్పుకునే కింగ్ కోబ్రా.. కొండల్లో కనిపించడం చాలా అరుదు అని పరిశోధకులు అంటున్నారు.
హిమాచల్ప్రదేశ్లోని కోలార్ ఫండి గ్రామ నివాసి ప్రవీణ్ సింగ్ ఠాకూర్ ఈ పాము చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తన పెంపుడు కుక్క బ్లాకీతో కలిసి వాకింగ్కు వెళ్లిన ప్రవీణ్ సింగ్ ఠాకూర్.. కొంత దూరం వెళ్లాక తన కుక్క అరుస్తుండటం గమనించాడు. కొద్ది దూరంలో పొడవాటి నాగుపామును చూశాడు. వెంటనే తన మొబైల్ ఫోన్లో దానిని బంధించి.. ఇంటికొచ్చాక సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ అత్యంత విషపూరితమన కింగ్ కోబ్రా.. శివాలిక్ కొండల్లో తచ్చాడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రవీణ్ కుమార్ షేర్ చేసిన ఫొటోలను చూసిన వణ్యప్రాణి విభాగం అధికారులు.. ఇది ముమ్మాటికీ కింగ్ కోబ్రాయే అని చెప్పారు. శివాలిక్ కొండల్లో ప్రయాణించే వారు కింగ్ కోబ్రా పట్ల జాగ్రత్తగా ఉండాలని వణ్యప్రాణి విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..