మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 23 : మహబూబ్నగర్లో ఈనెల 26న నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రోడ్ షోతో పాటు క్లాక్ టవర్లో నిర్వహించే సమావేశం లో కేసీఆర్ పాల్గొంటారన్నారు. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, అన్ని వర్గాలు సర్కారుపై గుర్రుగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
హన్వాడ మండలం తిరుమలగిరికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్గుప్తా, రాజేశ్వర్గౌడ్, నాయకులు మల్లు నర్సింహారెడ్డి, రవీందర్రెడ్డి, రాఘవేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.