మక్తల్ టౌన్ ఏప్రిల్ 26: పాలమూరులో కేసీఆర్ రోడ్ షో కార్యక్రమానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాలమూరుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ షోలో పాల్గొనేందుకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలను తరలిస్తున్నామన్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం బీ ఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు.
మూసాపేట, ఏప్రిల్ 26 : పాలమూరులో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోకు దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపు మేరకు పెద్ద సం ఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.
దేవరకద్ర, ఏప్రిల్ 26 : జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఉద్యమ నేత కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, రాజు, ఆంజనేయులు ఉన్నారు.
భూత్పూర్, ఏప్రిల్ 26 : జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ అధినేత కార్నింగ్ మీటింగ్కు మండలం నుంచి నాయకు లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, నర్సింహాగౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన కేసీఆర్ కార్నర్ మీటింగ్కు కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
రాజాపూర్, ఏప్రిల్ 26: బాలానగర్-రాజాపూర్ మం డలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళలు భారీగా తరలివెళ్లారు. బాలానగర్, రాజాపూర్, ఈద్గాన్పల్లి, మల్లెపల్లి, దొండ్లపల్లి, చిన్నరేవల్లి, పెద్దరేవల్లి, ఉడిత్యాల, తిర్మలాపూర్, రంగారెడ్డిగూడ తదితర గ్రామాల బీ ఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: పార్లమెంట్ ఎన్నిక ల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చం ద్రశేఖర్రావు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన బస్సుయాత్రకు నారాయణపేట బీఆర్ఎస్ శ్రేణులు త రలివెళ్లారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్ బ స్సుయాత్రకు వెళ్తున్న వాహనశ్రేణిని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహిమూద్ అన్సారీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్, వెంకట్రాములు, దేవరాజ్, లక్ష్మణ్, వీరేశ్, శేఖర్
నారాయణపేటరూరల్,ఏప్రిల్26: మహబూబ్నగర్ పట్టణంలో కేసీఆర్ రోడ్షోకు పేట మండలం నుంచి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. అప్పక్పల్లిలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యం లో, కోటకొండలో మండల అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో, సింగారంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి , శ్రీనివాస్రెడ్డి, హన్మంతు ఆధ్వర్యంలో జాజాపూర్లో వెంకటప్ప, అలీశెర్ ఆధ్వర్యంలో, అప్పిరెడ్డిపల్లిలో సుభాన్రెడ్డి, విశ్వనాథ్ ఆధ్వర్యంలో, జాజాపూర్లో డాక్టర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ఊట్కూర్, ఏప్రిల్ 26: పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు ఖాయమని, తమ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, సుధాకర్రెడ్డి, శివారెడ్డి, ఆనంద్రెడ్డి, మోనప్ప, నరేశ్, బల్రాం, రవి, కన్న, వాజిద్, ప్రేమ్ సుధాకర్, సచిన్, ఆసీఫ్, జాకీర్ పాల్గొన్నారు.
మరికల్, ఏప్రిల్ 26: మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రానికి వస్త్తున్న బీర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు మండలం నుంచి భారీగా బీఆర్ఎస్ నా యకులు తరలివెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరుతూ, చేపట్టిన బస్సుయాత్రకు పెద్దఎత్తున నాయకులు, మహిళలు తరలివెళ్లారు. నాయకులు హన్మిరెడ్డి, తిరుపతయ్య ఆధ్వర్యంలో నాయకులు పాలమూరుకు బయలుదేరారు.
ధన్వాడ, ఏప్రిల్ 26: ధన్వాడ మండలం నుంచి బయలుదేరిన వారిలో గౌని శ్రీనివాసులు, సచిన్, నర్సింహారెడ్డి, మల్లేశ్ గౌడ్, శివారెడ్డి, సురేందర్ రెడ్డి, గొల్ల నర్సిములు, వెంకట్రెడ్డి ఉన్నారు.
రాజాపూర్, ఏప్రిల్ 26: పాలమూరులో రోడ్షోకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బాలానగర్-రాజాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళలు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఘనస్వాగ తం పలికారు. ఉమ్మడి మండలంలోని నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపైకి భారీగా చేరుకొని స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మ న్ ప్రభాకర్రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ వాల్యానాయ క్, బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, శ్రీశైలంయాదవ్, ఆ యా గ్రామాల నాయకులు, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.