Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha polls) మూడో విడత (Third Phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 50.71 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 63.11 శాతం మేర పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా మహారాష్ట్రలో 42.63 శాతంగా ఓటింగ్ నమోదైంది.
కేంద్ర ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం.. అస్సాంలో 63.08 శాతం, బీహార్లో 46.69 శాతం, ఛత్తీస్గఢ్లో 58.19 శాతం, గోవాలో 61.39 శాతం, గుజరాత్లో 47.03 శాతం, కర్ణాటకలో 54.20 శాతం, మధ్యప్రదేశ్లో 54.09 శాతం, ఉత్తరప్రదేశ్లో 46.78 శాతం, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 52.43 శాతం మేర పోలింగ్ నమోదైంది.
ఈ మూడో విడుతలో మొత్తం 11 రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్పై తీర్పు రిజర్వ్
Met Gala | మెట్ గాలాలో గాజా అలజడి.. పాలస్తీనా జెండాలతో నిరసనలు.. పలువురు అరెస్ట్
IPL 2024 | ఫ్లైట్ రెండుసార్లు దారి మళ్లింపు.. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు