మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 6 : పదేండ్లల్లో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించి, కారు గుర్తుకు ఓటేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని గె లిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. సోమవారం మహబూబ్నగర్లోని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసి న సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నెతో కలిసి హాజరై మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. లాయర్లకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ప్రజలు బీఆర్ఎస్కు మద్దతిస్తున్నారన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరించాలని ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అభ్యర్థించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంనాథ్గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్, ప్రభుత్వ న్యాయవాది మనోహర్, సీనియర్ న్యాయవాది ప్రతాప్కుమార్, ఉమాదేవి, రవికుమార్యాదవ్, విజయ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.