అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) బెయిల్రద్దు విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది(Bela Trivedi) , జస్టిస్ పంకజ్ మిత్తల్ (Pankaj Mittal ) కేసుపై స్పందిస్తూ 10 వారాల తరువాతే విచారిస్తామని స్పష్టం చేశారు. వేసవి సెలవుల తర్వాత వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ధర్మాసనం వెల్లడించింది.
ఈ కేసులో చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో ఉంచిన విషయం తెలిసిందే. జైలులో ఉన్నప్పడు ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకోగా మధ్యంతర బెయిల్ లభించింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసింది.