మహబూబ్నగర్ అర్బన్, మే 6 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి అగిపోయిందని, పచ్చని మైదానాలు పా డుబడ్డాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వి మర్శించారు. సోమవారం మహబూబ్నగర్లోని జిల్లా క్రీడా, బాలుర కళాశాల మైదానా ల్లో పింక్ కలర్ బెలూన్స్ వదిలారు. అనంత రం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అ భ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. వాకర్స్తో కలిసి జిమ్ చేసి, షటిల్ ఆ డారు. మైదానంలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్ హ యాంలో మండలానికో క్రీడా మైదానం ని ర్మించామని గుర్తు చేశారు. మహబూబ్నగర్ క్రీడా మైదానానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశామన్నారు. ప ద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, ఏనుగొం డ.. ఇలా ప్రతి వార్డులో పార్కు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాగా మీరు చేసిన అభివృ ద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందని వాకర్స్ శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు.