KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో కేసీఆర్ పర్యటన యథావిధిగా కొనసాగుతోంది.
రైతుల కోసం, రాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్షోలో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లిలో కేసీఆర్ వెళ్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.