Delhi : దేశ రాజధాని ఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి యోగానంద్ శాస్త్రి ఎన్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా యోగానంద్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ మూడు పర్యాయాలు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు. మూడుసార్లు షీలాదీక్షితే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆహార, పౌరసరఫరాల మంత్రిగా, రెండోసారి గెలిచినప్పుడు ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, మూడోసారి అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు.
#WATCH | NCP leader and former Delhi Minister Yoganand Shastri joins Congress, in Delhi pic.twitter.com/0xZ4tCXsQZ
— ANI (@ANI) May 4, 2024