బెంగళూరు: రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిరాకరిస్తూ రైల్వే అధికారులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
కదులుతున్న రైలు నుంచి దిగుతున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు మరణించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మృతిచెందిన ఆ ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4 లక్షలకు 7% వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నది.