చిగురుమామిడి, జూలై 2: మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి నిర్వాసితులు సహకరించాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రాజెక్ట్ ప్రారంభించి రైతులకు నీరందించాలని మండల కేంద్రంలో రైతు ఐక్యవేదిక మండలాధ్యక్షుడు పన్యాల భూపతి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష శనివారం 18వ రోజు చేరింది.
ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అందే సుజాత, మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. దీనిని ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటికైనా అకడి రైతులు ఆలోచించి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించేందుకు సహకరించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ కొమ్మెర మంజుల, సర్పంచులు పీచు లీల, పిట్టల రజిత, చెప్యాల మమత, పెద్దపల్లి భవాని, ఎంపీటీసీలు కొత్తూరి సంధ్య, మంకు స్వప్న, మాజీ సర్పంచ్ శ్యామకూర శారద, సింగిల్ విండో డైరెక్టర్ మాచమల్ల లక్ష్మి, ఉపసర్పంచులు ముకెర పద్మ, పెండ్యాల శారద, వార్డు మెంబర్లు బోలుమల్ల సావిత్రి, చింతపూల శ్యామల, అప్పాల యశోద, బెజ్జంకి తిరుమల, గరిగే వజ్రవ్వ, మహిళా నాయకులు మామిడి రాజేశ్వరి, గొల్లపల్లి అరుణ, తోట రజిత, గందే జ్యోతి, జంగం స్వరూప, చెరుకు సరోజన, పెసరి పద్మ, జెట్టి అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.