AP theaters | దసరా పండక్కి ముందు టాలీవుడ్ నిర్మాతలకు తీపికబురు చెప్పాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . అక్కడ థియేటర్స్ ఓనర్లకు.. నిర్మాతలకు మంచి వార్త చెప్పాడు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడుస్తున్నాయి. దాంతో వసూళ్లపై కూడా భారీ ప్రభావం పడుతుంది. అలాంటిది ఇప్పుడు నిర్మాతలకు, బయ్యర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్నో నెలలుగా ఆంక్షల మధ్య నడుస్తున్న థియేటర్స్కు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రోజుల కిందటే ఇక్కడ ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం కరోనా కేసులు భారీగానే నమోదవుతూ వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల కారణంగా ఏపీలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. దీనికి తోడు మూడు షోలు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుండటంతో థియేటర్స్ వరకు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చారు వైఎస్ జగన్. అయితే ఏపీలో నైట్ కర్ఫ్యూ మాత్రం అలాగే కొనసాగనుంది. శర్వానంద్, సిద్ధార్థ్ మహా సముద్రం సినిమా నుంచే 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రానుంది. అక్టోబర్ 14 ఈ సినిమా విడుదల కానుంది. అలాగే అక్టోబర్ 15న అఖిల్, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా రిలీజ్ కానుంది. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో ఈ సినిమాల నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే టికెట్ రేట్స్ విషయంలో మాత్రం ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్ నడుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Brahmanandam | జబర్దస్త్ కమెడీయన్ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
Maha Samudram pre release | మహా సముద్రం ప్రివ్యూ.. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
Avika Gor | ఆ అనుభవం చాలా నేర్పించింది: అవికాగోర్