సిటీబ్యూరో, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): నగరంలో పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తూనే ఉంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర్ రింగు రోడ్డు అందుబాటులో ఉంది. ఓఆర్ఆర్ ఉండే ట్రాఫిక్ మొత్తంలో సింహభాగం ఐటీ కారిడార్ నుంచే ఉంటోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, నానక్రాంగూడ, పుప్పాలగూడ, కోకాపేట, మణికొండ, నార్సింగి ప్రాంతాల నుంచి ఔటర్పై రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ సమస్య పరిష్కారానికి నార్సింగి ప్రాంతంలో కొత్తగా వాహనాలు ఔటర్పైకి ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కావచ్చాయి. టోల్ వసూలుకు సంబంధించిన షెడ్ల నిర్మాణం పనులు చివరి దశలో ఉండగా, నవంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నార్సింగి ఇంటర్చేంజ్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల రద్దీ నానక్రాంగూడ ఓఆర్ఆర్ టోల్ప్లాజా దగ్గర రద్దీ తగ్గనుంది.