రియాద్: సౌదీ అరేబియాలో కీలకమైన అరామ్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో రాస్ తనూరాలోని చమురు శుద్ధి కర్మాగారం నుంచి దట్టంగా పొగలు ఎగసిపడ్డాయి. (Iran’s Drones Hit Saudi Oil Refinery) ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సంఘటన ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. ముడి చమురు ధరలు 9.32 శాతం మేర పెరిగాయి.
కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం మేర సాగే హార్ముజ్ మార్గంపై ప్రభావం పడింది. ఇరుకైన ఈ మార్గాన్ని ఇరాన్ అధికారికంగా మూయలేదు. అయినప్పటికీ భద్రత దృష్ట్యా హార్ముజ్ జలసంధికి ఇరువైపులా పలు ట్యాంకర్లు, కార్గో పిప్లు నిలిచిపోయాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో చమురు రవాణాకు అడ్డంకి వల్ల ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
Ras Tanura Oil Facility Attacked: Saudi Arabia Reports Drone Strike on Key Export Terminal https://t.co/eQGFEBYvcH pic.twitter.com/tTCoDv9za6
— Bricx News (@BricxNews) March 2, 2026
Also Read:
Watch: ఎఫ్-15 ఫైటర్ జెట్ క్రాష్.. అమెరికా యుద్ధ విమానాలు కూలాయన్న కువైట్
Iran Raises Red Flag | ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. దీని అర్థం ఏమంటే?