టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఆ దేశం ఆగ్రహంతో రగిలిపోతున్నది. ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్న మసీదుపై ఎర్ర జెండా రెపరెపలాడింది. ఆదివారం ప్రసిద్ధ జాంకరన్ మసీదు గోపురంపై ఈ ప్రతీకార జెండాను ఎగురవేశారు. ఈ మసీదుపై ఎర్ర జెండా ఎగురవేయడాన్ని ప్రతీకారాన్ని సూచించే సంకేత చిహ్నంగా భావిస్తారు.
కాగా, ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్లపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అలాగే ముస్లిం దేశాల్లో అయతుల్లా అలీ ఖమేనీకి మద్దుతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శత్రువులపై పెరుగుతున్న కోపం, ప్రతీకారాన్ని ఈ ఎర్ర జెండా ప్రతిబింబిస్తుంది.

Red Flag Over Mosque
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తమ దేశ సాయుధ దళాలు శత్రు లక్ష్యాలపై దాడి చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఖమేనీ నిర్దేశించిన మార్గాన్ని ఇరాన్ అనుసరిస్తుందని తెలిపారు. ఆయన మరణం తర్వాత ఏర్పడిన నాయకత్వ మండలి తన పనిని ప్రారంభించిందని చెప్పారు. ప్రత్యర్థులపై ఇరాన్ బదులు తీర్చుకుంటుందని అన్నారు.
Also Read:
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Lucknow |ఇరాన్లో ఖమేనీ మృతి.. లక్నోలో నిరసనలకు పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు