భద్రాచలం, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్పోస్ట్ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.
పక్క రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యం, డబ్బు, ఇతర బహుమతులను తరలించినైట్లెతే వెంటనే పట్టుకోవాలన్నారు. అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి రూపాయిని వ్యయ పరిశీలకుల బృందాలు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన ధర ప్రకారం ఖర్చు నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ ఆఫీసర్ వేల్పుల శ్రీనివాసరావు, లైజనింగ్ ఆఫీసర్ పృథ్వీరాజ్, పట్టణ సీఐ సంజీవరావు, ఎస్ఎస్టీ అధికారి మధు, ఆర్ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.