న్యూఢిల్లీ : దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 166వ రోజుకు చేరింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 33,54,69,340 కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 ఏజ్గ్రూప్లో బుధవారం ఒకే రోజు 25.14లక్షలకుపైగా డోసులు లబ్ధిదారులు అందజేసినట్లు పేర్కొంది. ఇందులో 13,43,231 మందికి ఫస్ట్ డోసు, మరో 87,735 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. మూడో దశ డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18-44 ఏజ్గ్రూప్లో 9,14,62,206 మందికి మొదటి, మరో 21,77,618 మందికి రెండో మోతాదు అందిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో 18-44 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 50లక్షలకు పైగా టీకాలు అందించాయని వివరించింది.