Team India | సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనను భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించింది. సిల్హెట్ వేదికగా ఆదివారం బంగ్లాతో జరిగిన తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
యస్తికా భాటియా (36) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమవడంతో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రేణుకా సింగ్ (3/18) బంగ్లాను కట్టడిచేసింది.