టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా పగ్గాలు అందుకున్న తర్వాత తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ సత్తా చాటాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో అర్ధశతకం సాధించాడు. ఇది రోహిత్ శర్మ కెరీర్లో 44వ హాఫ్ సెంచరీ. స్వల్పలక్ష్య ఛేదనలో భారత జట్టు తడబడకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఓపెనర్లు శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అందుబాటులో లేకపోవడంతో.. తన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ భారత స్కోరుబోర్డును తనదైన స్టైల్లో ముందుకు తీసుకెళ్లాడు.
177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు రోహిత్ శర్మ (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (15 నాటౌట్) మంచి ఆరంభాన్నందించారు. వీరిద్దరూ చాలా సంయమనంతో ఆడుతూ.. ప్రతి ఓవర్లోనూ కనీసం ఒక బౌండరీ ఉండేలా చూసుకుంటున్నారు. పదో ఓవర్ నుంచి గేరు మార్చిన రోహిత్ భారీ షాట్లతో విండీస్ బౌలర్లకు గుబులు పుట్టించాడు. రోహిత్ ధాటికి భారత జట్టు 12 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.