న్యూఢిల్లీ : శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అది మనిషి మెదడు నుంచే అన్నది నగ్నసత్యం. మెదడులో పుట్టిన ఆలోచనల నుంచి ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. మెదడుతో సమానంగా పనిచేసేలా కృత్రిమ మేధస్సును తీసుకొచ్చినా.. అది మరింత వేగంగా పనిచేయాలన్నా మళ్లీ మనిషి మెదడులోని న్యూరాన్లే కారణం అవుతున్నాయి. కృత్రిమ మేధస్సుకు పదునుపెట్టే పరిశోధనల్లో భాగంగా ప్రత్యేక కృత్రిమ న్యూరాన్లను అభివృద్ధి చేసి ఔరా! అనిపించుకుంటున్నారు ఐఐటీ ఢిల్లీకి చెందిన పరిశోధకుల బృందం.
మనిషి మెదడును ప్రేరణగా తీసుకుని ప్రత్యేక కృత్రిమ న్యూరాన్లను తయారుచేసినట్లు చెప్తున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫేసర్ మన్నన్ సూరి. ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ మన్నన్ సూరి ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సుకు ప్రత్యేక న్యూరాన్ల సాయంతో మరింత వేగవంతం చేసే పనిలో ఉన్నారు. న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ అనేది సాంకేతిక పరిజ్ఞానం ప్రాంతాన్ని సూచిస్తుంది. న్యూరాన్లు, సినాప్సెస్ మెదడులోని తెలివితేటల ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్. ఈ పరిశోధన ఇంటర్ డిసిప్లినరీ స్వభావం కారణంగా.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరోమార్ఫిక్ హార్డ్వేర్, నానోఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలను కలుపుతుంది అని పరిశోధకులు చెప్తున్నారు.
వినూత్నంగా ఆవిష్కరించిన ‘స్పైకింగ్’ న్యూరాన్ మోడల్కు ‘డెక్సాట్’ (డబుల్ ఎక్స్పోనెన్షియల్ అడాప్టివ్ థ్రెషోల్డ్ న్యూరాన్) అని పేరుపెట్టారు. ఈ పరిశోధన ముఖ్యంగా స్పీచ్ రికగ్నిషన్ వంటి నిజమైన యాప్ల కోసం ఖచ్చితమైన, వేగవంతమైన, సమర్థవంతమైన న్యూరోమార్ఫిక్ ఏఐ వ్యవస్థలను రూపొందించడానికి ఉపయోగపడనున్నది. కొత్తగా అభివృద్ధి చేసిన కృత్రిమ న్యూరాన్ లక్షణాలు ‘డెక్సాట్’ అని పిలువబడే న్యూరోమార్ఫిక్ ప్రాసెసింగ్ కోసం కొత్త మల్టీ టైమ్ స్కేల్ స్పైకింగ్ న్యూరాన్ మోడల్. సెమీకండక్టర్ మెమరీ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలపై, విద్య-పారిశ్రామిక భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతున్న యాప్లపై విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ మన్నన్ సూరి తెలిపారు. ఈ పరిశోధన పత్రం ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురించారు. ప్రొఫెసర్ మన్నన్ సూరితో పాటు మరో ఇద్దరు పరిశోధకులు అహ్మద్ షబాన్, సాయి సుకృత్ బెజుగం ఈ పరిశోధన పనిలో పాల్గొన్నారు. పరిశోధకులు హైబ్రిడ్ నానోవైస్ ఆధారిత హార్డ్వేర్ను విజయవంతంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వీ రామ్గోపాల్రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించి పరిశోధక బృందానికి అభినందనలు తెలిపారు.
షారుఖ్ఖాన్ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్ కార్తీక్
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
ఆఫ్ఘాన్లోకి జిహదీలను పంపారు : పాక్పై ఘనీ ఘాటు వ్యాఖ్య
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్ సెనెట్
చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..