న్యూయార్క్ : రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో వాతావరణ మార్పులు భయంకరంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారు రిచర్డ్ సెనెట్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మన ఎదుర్కొంటున్న కరోనా కేవలం ట్రైలర్ మాత్రమే అని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అందరి సమగ్ర అభివృద్ధి ఒక సవాలుగా నిలువనున్నదన్నారు.
వాతావరణ మార్పు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా పెద్ద సమస్యలుగా మనల్ని చుట్టముట్టనున్నాయని రిచర్డ్ సెనెట్ హెచ్చరించారు. మతం లేదా జాతీయత ముసుగులో ప్రజల్లో ఉగ్రవాదం లేదా పెరుగుతున్న ఆర్థిక అసమానత కూడా పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. వీటన్నింటినీ కరోనా వైరస్ బహిర్గతం చేసిందని, కరోనా ఒక ట్రైలర్ మాత్రమేనని, రానున్న 5-10 ఏండ్లలో మరిన్ని మహమ్మారులను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ రోజు ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య స్థాయిలో వాతావరణ మార్పు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా రెట్లు ఉంటాయని, ఇవాళ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్లే, భవిష్యత్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండదని అన్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రజలు కంకణబద్దులు కావాలని, కర్బన ఉద్గారాలను తగ్గించడం, విరివిగా మొక్కలు నాటడంలో ప్రభుత్వాలతో సహకరించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించిన వారం అవుతామని చెప్పారు.కరోనా ప్రతి రంగంలో సాంప్రదాయ ఆలోచన, పద్దతిని తీసుకొచ్చి మనం అనుసరిస్తున్న లోపాలను ఎత్తి చూపిందని రిచర్డ్ సెనెట్ పేర్కొన్నారు.
చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
సువేందు మెడకు బాడీగార్డ్ మృతి కేసు
ఆ ఫొటో జర్నలిస్ట్ను మేం చంపలేదు : తాలిబాన్
విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలి : కేరళ గవర్నర్
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..