అమరావతి : పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) ను రానున్న ఎన్నికల్లో ఓడించి తీరుతానని కాపు ఉద్యమనేత , వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సవాల్ విసిరారు. ఒక వేళ ఓడించకపోతే నాపేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వెల్లడించారు.
కాపు ఉద్యమానికి ఏనాడు మద్దతివ్వని పవన్కు కాపు (Kapus) లు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. రాజకీయంపై, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని సూచించారు. సినిమా(Cinema) లో నటించండిగాని రాజకీయాల్లో కాదని సూచించారు. ఎన్నికల అనంతరం జనసేన (Janasena) త్వరలో ఫ్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు.
చంద్రబాబుపై కూడా ముద్రగడ ఫైర్ అయ్యారు. 1978లో చంద్రబాబుకు ఇంటి పెంకులు కూడా మార్చుకోవడానికి కూడా స్తోమత లేదని, ప్రస్తుతం అపర కోటీశ్వరుడు ఎలా అయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన ప్రయోజనం లేదని పేర్కొన్నారు.