ముంబై: ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే తాను కాఫీ తాగడం ప్రారంభిస్తానని అన్నాడు ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్. ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించడం షారుక్కు అలవాటు. ఈసారి కూడా కింగ్ ఖాన్ అదే పని చేశాడు. బుధవారం అభిమానుల అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ట్వీట్ చేస్తూ.. ఈసారి కేకేఆర్ కప్ గెలుస్తుందిగా అని అడిగాడు. దీనికి షారుక్ స్పందిస్తూ.. గెలుస్తుందనే అనుకుంటున్నా. అలా జరిగితే నేను కాఫీ తాగడం మొదలుపెడతాను అని బదులిచ్చాడు. ఇప్పటి వరకూ కోల్కతా నైట్రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఇవీ కూడా చదవండి..
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్లో చెమటోడ్చిన ధోనీ, రైనా