హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎస్ఎస్ ఇన్ఫోటెక్…మరో హైదరాబాదీ వ్యవసాయోత్పత్తుల రిటైల్ చైన్ పొలిమేరాస్ ఆగ్రోస్ను కొనుగోలు చేసింది. రూ.250 కోట్ల విలువతో పొలిమేరాస్లో నూరు శాతం వాటాను కొంత నగదు, కొంత స్టాక్ రూపంలో చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు జీఎస్ఎస్ ఇన్ఫో సోమవారం ప్రకటించింది. ఈ టేకోవర్కు జీఎస్ఎస్ ఇన్ఫోటెక్ బోర్డు ఆమోదం తెలిపింది. వివిధ అనుమతులకు లోబడి జీఎస్ఎస్లో పొలిమేరాస్ విలీనం జరుగుతుంది. మారుతున్న వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మక వృద్ధి అవకాశాలపై దృష్టినిలిపామని, టెక్నాలజీపై తమకున్న పట్టు ద్వారా బీ2సీ ఈ-కామర్స్ అందిపుచ్చుకునేందుకు ఈ టేకోవర్ జరిపినట్లు జీఎస్ఎస్ సీఈవో భార్గవ్ మారేపల్లి చెప్పారు.
పొలిమేరాస్ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో 75 స్టోర్ల ద్వారా కూరగాయలు, పండ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర గృహ వినియోగ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నది. ఒక్కో స్టోర్ను నెలకు సగటున 21,000 మంది సందర్శిస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. అలాగే మరో 100 స్టోర్లను సమీస భవిష్యత్తులో ప్రారంభించడంతో పాటు, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టనున్నది. మరోవైపు జీఎస్ఎస్ ఇన్ఫోటెక్…ఆప్లికేషన్ డెవలప్మెంట్, ఈ-కామర్స్, క్లౌడ్, సెక్యూరిటీ, రిమోట్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సర్వీసుల్లో నిమగ్నమై ఉన్నది. పొలిమేరాస్ టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో జీఎస్ఎస్ ఇన్ఫోటెక్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి, రూ.127 వద్ద నిలిచింది.
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్, క్విప్ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించే ప్రతిపాదనను జీఎస్ఎస్ ఇన్ఫో బోర్డు ఆమోదించింది. అలాగే రూ.107 ధరపై ప్రమోటర్లు, నాన్-ప్రమోటర్లకు 28 లక్షల కన్వర్ట్బుల్ వారెంట్లను జారీచేసి రూ. 29.96 కోట్లు సేకరించేందుకు బోర్డు అనుమతి తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jio Shock for Users | యూజర్లకు జియో మరో షాక్.. ఆ ప్లాన్లపై 20% అదనపు బాదుడు!
Govt on Crypto’s | క్రిప్టోల ప్రోత్సాహంపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?!
US Modern Immigration | మన టెక్కీలకు అవకాశాలు ఫుల్.. స్టార్టప్లకు డెడికేటెడ్ వీసా!
BitCoin | 49 వేల దిగువన బిట్ కాయిన్.. 20 శాతం వరకు డౌన్!