Jio Shock for Users | టెలికం సంచలనం రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరోమారు షాక్ ఇచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్లను జియో సవరించిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ బండిల్డ్ ప్లాన్లపై 20 శాతం ధరలు అదనంగా పెంచేసింది. అంటే ఇంతకుముందు రూ.499కే ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు ఇక రూ.601 నుంచి ప్రారంభం కానున్నాయి.
గతంలో 28 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ హైస్పీడ్ డేటా గల డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఏడాది సబ్స్క్రిప్షన్ ధరను రూ.601కి పెంచేసింది. అయితే, ఈ ప్యాక్లో 6 జీబీ హైస్పీడ్ డేటాను అదనంగా అందిస్తున్నది. దీంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్లు చేసుకోవచ్చు. ఇంతకుముందు రూ.666లకు లభించే ప్లాన్ ధరను రూ.799లకు పెంచేసింది. ఇందులో డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్తో పాటు 56 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.
అలాగే 84 రోజుల వ్యాలిడిటీ కల రూ.888 ప్లాన్ ధర రూ.1,066కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది జియో. ఈ ప్లాన్లో ప్రతి రోజూ 2 జీబీ డేటా ప్లస్ 5జీబీ అదనపు డేటాను అందిస్తున్నది. ఇక 365 రోజుల వ్యాలిడిటీ గల రూ.2,599 ప్లాన్ ధర రూ.3,119 చేసేసింది. ఈ ప్లాన్లో రోజూ 2జీబీ డేటాతోపాటు అదనంగా 10 జీబీ డేటా అందిస్తుంది. 56 రోజుల వ్యాలిడిటీ, 1.5 జీబీ రోజువారీ డేటాగల ప్లాన్ ధర రూ.549 నుంచి 659లకు పెంచేసింది.