హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లక్ష్మి అనే మహిళను తన భర్త కటుంబ కలహాల నేపథ్యంలో హమార్చాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం.. రిక్టర్స్కేలుపై 3.8 తీవ్రత నమోదు!
Singareni Collieries | ఆదాయం 3,500.. నష్టం 8,500.. ‘అడ్రియాల’తో సింగరేణి సంస్థకు నష్టాల మూట!