Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపలు కలకలం రేపాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.