హైదరాబాద్ : శంషాబాద్లోని విమానాశ్రయంలో ఆదివారం భారీగా మాదకద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున తరలిస్తున్న హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ ఎనిమిది కిలోల వరకు ఉండగా.. దాని విలువ రూ.53కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఖతర్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో దోహా నుంచి మహిళ హైదరాబాద్కు వచ్చింది. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. హెరాయిన్ పట్టుబడింది. నిందితురాలు జాంబియాకు చెందిన మకుంబా కరోల్గా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని హెరాయిన్ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నది.. ఎక్కడికి తరలిస్తున్నది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.