న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు క్రమంగా గిరాకీ పుంజుకుంటున్నది. భవిష్యత్లో తమ వినియోగదారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేలా రోడ్డు పక్కన ఉండే సాధారణ మెకానిక్లకు శిక్షణ ఇవ్వాలని హీరో ఎలక్ట్రిక్ యాజమాన్యం నిర్ణయించింది. రానున్న మూడేళ్లలో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేవారిలోనూ విశ్వాసం పెరుగుతుందని హీరో ఎలక్ట్రిక్ ఆశిస్తున్నది.
ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 1,500 ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. దేశమంతా 4,000 మంది మెకానిక్లకు శిక్షణ కూడా ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 53 వేల విద్యుత్ వాహన యూనిట్లను విక్రయించింది. వచ్చే రెండేండ్లలో 20 వేల ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నది.
వినియోగదారుల రోజువారీ సమస్యల పరిష్కారానికి నిరంతరం వారికి తోడుగా ఉండటానికే మైకానిక్ల శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చామని.. 2023 చివరికల్లా 20వేల మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో లక్ష ద్విచక్ర వాహనాల విక్రయమే లక్ష్యంగా పెట్టుకున్నామని నవీన్ ముంజాల్ తెలిపారు. ప్రస్తుతం నెలకు సగటున 8,500 యూనిట్లను విక్రయిస్తున్నామని చెప్పారు.
విద్యుత్ వాహనాలపై వినియోగదారులకు పెరుగుతున్న అవగాహనకు అనుగుణంగా మార్కెట్ మరింత విస్తరిస్తుందని నవీన్ ముంజాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్కు ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు