హైదరాబాద్: హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీనామా పత్రంతో హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్దకు ఆయన బయల్దేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. తాను రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వస్తున్నాని, సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలన్నారు. అలాచేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
బిగ్ బ్రేకింగ్
రాజీనామా పత్రంతో మరికాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు ఎమ్మెల్యే హరీష్ రావు
ఆగస్టు 15వ తేదిలోపు రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్యే హరీష్ రావు. pic.twitter.com/1zqO3G7S7q
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024