హుస్నాబాద్: కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ నిరంతరం ఉండేదని, ఇప్పుడు నిత్యం సరఫరా నిలిచిపోతున్నదన్నారు. రైతులు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది.. తులం బంగారం తుస్సుమన్నదని చెప్పారు. పెండ్లి చేసుకున్న వాళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ అమలు కాలేదన్నారు. పైగా కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయని, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. కేసీఆర్ ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్కు వచ్చినప్పుడు తాము గెలిస్తే ఇక్కడ మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పారని గుర్తించారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేశామని రాహుల్ గాంధీ చెప్పారని, ఆయన అబద్ధాల గాంధీగా మారారని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, ధాన్యానికి రూ.500 బోనస్ రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన రాహుల్ గాంధీ మీటింగ్ తుస్ మన్నది. 30 వేల కుర్చీలు వేసి కూలర్లు పెడితే పట్టుమని 3 వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి పోయి లోపలకు రండని బ్రతిమిలాడిన ఎవరూ వస్తలేరని చెప్పారు.
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలుచుకుంటే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది – అరవింద్ ధర్మపురి pic.twitter.com/CnxRyjyNt1
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024