Hardeep Singh Puri : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం సాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు. తాము రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నామని తమలో ఏ ఒక్కరూ చెప్పలేదని అన్నారు. రాజ్యాంగ మార్పులకు సంబంధించిన అంశంలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగ సవరణపై విపక్షం తప్పుడు విషయాలను ప్రచారంలో పెడుతున్నాయని దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని కేంద్ర మంత్రి హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ కేవలం రెండు దశల పోలింగ్ మాత్రమే ముగిసిందని, ఇంకా ఐదు దశల పోలింగ్ మిగిలిఉందని ఈ ఎన్నికల్లో తాము 400 స్ధానాలు గెలుచుకుంటామని హర్దీప్ సింగ్ పూరి ధీమా వ్యక్తం చేశారు.
వారసత్వ పన్ను తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రొఫెసర్లలో ఒకరైన శ్యాం పిట్రోడా చెబుతున్నారని, అయితే ఆయన వారసత్వ పన్ను చెల్లించాల్సిన సమయంలో మాత్రం వారు కప్పిపుచ్చుకుంటారని ఎద్దేవా చేశారు.
Read More :
Osmania University | నీళ్లు, కరెంటు కోతలకు సాక్ష్యం ఓయూ