మహబూబ్నగర్ : నిరుద్యోగులు కష్టపడి సాధన చేస్తే ఉద్యోగాలు సాధించడం సులభమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
లక్ష్యసాధన దిశగా అంకిత భావంతో ముందుకు సాగే వారే విజేతలవుతారని తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఆల రఘుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పేద విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు ఆల రఘుపతి రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. నిరుద్యోగ విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి