బెల్లంపల్లిరూరల్, ఆగస్టు 12 : శుక్రవారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ) విద్యార్థులు సత్తా చాటారు. బైపీసీ అగ్రికల్చర్ విభాగంలో 38 మంది పరీక్ష రాయగా అందరూ అర్హత సాధించారు. వీరిలో దుర్గం రంజిత్ 2737 ర్యాంకు సాధించి కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంజినీరింగ్ విభాగంలో 33 మంది పరీక్ష రాయగా అందరూ అర్హత సాధించారు. వీరిలో మామిడిశెట్టి వరప్రసాద్ 3146 ర్యాంకుతో ప్రథమ స్థానంలో నిలిచారు.
అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగంలో దాసరి రాజశేఖర్రెడ్డి (6929), సెగ్గం అక్షయ్ (8106), సెండె విజ్ఞాన్(9019), గాజుల సాయికుమార్ (3522), ఆకుదారి ఆనంద్కుమార్( 8943), కామెర పవన్కల్యాణ్ (9566) లు అత్యంత ప్రతిభ చూపి 10 వేల లోపు ఉత్తమ ర్యాంకులు సాధించడంపై ప్రిన్సిపాల్ ఐనాల సైదులు సంతోషించారు. ఎంసెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఆర్సీవో కే స్వరూపారాణి, ఏఆర్సీవో కే మహేశ్వర్రావు అభినందించారు. ఉత్తమ ఫలితాల కోసం కృషి చేసిన ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫోన్లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులు మిఠాయిలు పంచి, సంబురాలు నిర్వహించారు.