న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల యూజర్లకు వచ్చే నెలలో కష్టాలు మొదలు కానున్నాయా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అమలులోకి తేనున్నది. తాజాగా సెర్చింజన్ గూగుల్ సైతం ఆ దిశగా ముందుకెళుతున్నది.
యూజర్లు ముందస్తుగా అనుమతి తీసుకుంటే తప్ప.. గూగుల్ తన ప్లే స్టోర్లోని యాప్లను అనుమతించదు.. గూగుల్ తన ప్లే స్టోర్లోని యాప్ల నిర్వహణ వ్యవస్థను వచ్చే నెల ఐదో తేదీ నుంచి మార్చేయనున్నట్లు ప్రకటించేసింది.
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి యాప్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిందే. ఎందుకంటే యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి యాప్.. వారి డేటింగ్ ప్రిఫరెన్సెస్, బ్యాంకింగ్ సమాచారం, రాజకీయ అనుబంధం, పాస్వర్డ్ మేనేజ్మెంట్ తదితర సమాచారాన్ని తెలుసుకునే వీలు ఉంది.
కానీ తాజాగా గూగుల్ అప్డేట్ విధానం ప్రకారం ఇక ప్రతి యాప్ అప్డేట్ చేసుకోవాలంటే ప్రతి యూజర్ అందుకు సరైన కారణం తెలుపాల్సి ఉంటుందని వార్తలొచ్చాయి. క్వారీఆల్ప్యాకేజెస్ పర్మిషన్ తీసుకుంటే ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11 యాప్స్లోని పూర్తి యాప్స్ జాబితా మీకు కనిపిస్తుంది.
అయితే, గూగుల్ తాజాగా అప్డేట్ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ పాలసీ ప్రకారం తన ప్లేస్టోర్లోని యాప్ల వినియోగం విషయమై ఆంక్షలు విధిస్తున్నది. స్మార్ట్ఫోన్ యూజర్లు వాటిని వాడేందుకు గూగుల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, బ్యాంకింగ్ యాప్స్ అండ్ పీ2పీ వాలెట్స్ వంటి ఫైనాన్సియల్ యాప్స్కు మాత్రం మినహాయింపునిచ్చింది గూగుల్.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు
వేదాంత కెయిర్న్తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు