చండీఘర్ : హర్యానాలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆ రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త వినిపించింది. శానిటేషన్ వర్కర్స్ జీతాలు పెంచుతున్నట్లు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు రూ. 12,500 నుంచి రూ. 14 వేలకు, పట్టణ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఒక వేళ జీతం ఇచ్చే విషయంలో ఆలస్యమైతే.. ఆ జీతానికి అదనంగా రూ. 500 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటనపై పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..