కుండపోత వర్షాలు, భారీ వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 71 అడుగులకు చేరిపోయింది. గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద కారణంగా క్షణక్షణానికి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇలా ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది.#Bhadrachalam #Godavari #Waterfloods pic.twitter.com/Zl8IjC5PtZ
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022
భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్నది. ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని ఇక్కడ ప్రజలు అంటున్నారు.
కాగా, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారిగా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయం పరిసరాలు నీట మునిగాయి.. #Bhadrachalam #Godavari #Waterfloods pic.twitter.com/z8tM00h7pC
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022