గీసుగొండ, మే 8: మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ జిల్లా గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య పేర్కొన్నారు. బుధవారం కోటగండి సాయిబాబా, మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఆమె తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొరం దందాతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని వివరించారు. కొందరు నాయకులు తన గురించి మంత్రి కొండా సురేఖకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. సదరు నాయకులకు దమ్ముంటే ప్రమాణం చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.